10.10.24

తిరుపతిలో ఆకట్టుకున్న ధార్మిక కార్యక్రమాలు





తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలతో పురప్రజలు ఆకట్టుకున్నాయి.


   ఇందులో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు శ్రీ విజయ కార్తీక్, శ్రీ ఇళయరాజా బృందం వాద్య సంగీతం, రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు శ్రీ వేణుగోపాల్ బృందం భరతనాట్య ప్రదర్శన  నిర్వహించారు. 

     అన్నమాచార్య కళామందిరంలో కడపకు చెందిన శ్రీ నటరాజ్ బృందం సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు వాద్య సంగీతం, రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు కడప ఒక చెందిన శ్రీ సూర్యప్రసాద్ నాట్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. 

    రామచంద్ర పుష్కరణ వద్ద శ్రీ భార్గవ్ రంగనాథ్ బృందం కర్ణాటక భక్తి సంగీత కార్యక్రమం  పురప్రజలను అలరించింది.

No comments :
Write comments