రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ శ్రీ నున్న తిరుమలరావు, శ్రీమతి నున్న సరోజినిదేవి దంపతులు శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు బుధవారం రూ.1,01,11,111/- విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్, అదనపు ఈవో అభినందించారు.
No comments :
Write comments