28.4.25

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళం




సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద ఇటీవల విరాళంగా అందించింది.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ శ్రీ కె.ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ శ్రీ ఈ.వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందజేశారు.

No comments :
Write comments