తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం ఏప్రిల్ 23 నుండి మే 2వ తేదీ వరకు జరుగనుంది.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 గంటలకు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు పెద్దమాడ వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం జరుగనుంది. మే 1న భోగి తేరు, మే 2న సాత్తుమొర జరుగనుంది. ఆలయంలో మే 3న గంధపొడి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
No comments :
Write comments