చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 5 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 4న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి.
రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
05-05-2025
ఉదయం - ధ్వజారోహణం (కర్కాటక లగ్నం- మధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంటల వరకు)
సాయంత్రం - శేష వాహనం
06-05-2025
ఉదయం - తిరుచ్చిఉత్సవం
సాయంత్రం - హంస వాహనం
07-05-2025
ఉదయం - సింహ వాహనం
సాయంత్రం - ముత్యపుపందిరి వాహనం
08-05-2025
ఉదయం - కల్పవృక్ష వాహనం
సాయంత్రం - సర్వభూపాల వాహనం
09-05-2025
ఉదయం - మోహినీ ఉత్సవం
సాయంత్రం - కల్యాణోత్సవం, గరుడ వాహనం
10-05-2025
ఉదయం - హనుమంత వాహనం
సాయంత్రం - వసంతోత్సవం, గజ వాహనం
11-05-2025
ఉదయం - సూర్యప్రభ వాహనం
సాయంత్రం - చంద్రప్రభ వాహనం
12-05-2025
ఉదయం - రథోత్సవం
సాయంత్రం - అశ్వవాహనం
13-05-2025
ఉదయం - చక్రస్నానం
సాయంత్రం - ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
No comments :
Write comments