తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయం (పీఏపీ-5) లో మంగళవారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నూతన భవనంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. కళ్యాణకట్ట, డైనింగ్ హాల్, లాకర్ల ఏర్పాటు, మరుగుదొడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు అన్నమయ్య భవన్ లో పీఏసీ-5 నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత విభాగాల అధికారులతో అదనపు ఈవో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ హరీంధ్రనాథ్, శ్రీ వెంకటయ్య, ఈఈలు శ్రీ వేణు గోపాల్, శ్రీ సుధాకర్, డీఈ శ్రీ చంద్ర శేఖర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments