ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కల్యాణవేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.
స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.
ఎదుర్కోలు ఉత్సవంలో అమ్మవారి తరఫున ఆచార్య రాఘవాచార్యులు స్వామివారి తరఫున ఆచార్య పి శ్రీనివాసన్ పాల్గొన్నారు.
No comments :
Write comments