టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలో శ్రీ వేంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం ఘనంగా జరిగింది.
విశాఖపట్నం ఎంవిపి కాలనీలోని టిటిడి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సుమారు 1000 మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ వ్రతాన్ని జిల్లా ధార్మిక కమిటీ మరియు దాతల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
భక్తులకు టిటిడి ద్వారా ఉచితంగా పూజా సామగ్రి, రెండు రకాల ప్రసాదాలు భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూచిపూడి, భరతనాట్యం, సంకీర్తనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ శ్రీనివాస వ్రతం విశాఖ నగర ప్రజల ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంపొందించింది. టిటిడి వేద పండితులు వేద పారాయణం నిర్వహించారు. భక్తులకు వేదాశీర్వచనాలు ఇచ్చారు.
కార్యక్రమ విజయవంతానికి జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు, అన్నమయ్య సేవా సంస్థ సభ్యులు, వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థలు మరియు సభ్యులు, శ్రీవారి సేవకులు తనవంతు సేవ అందించి ఎంతో సహకరించారు.
కార్యక్రమంలో క్లస్టర్ సూపరింటెండెంట్ శ్రీ కాంతికుమార్, జిల్లా ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ సత్యనారాయణ, జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
No comments :
Write comments