తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మే 2వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు పెద్దమాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments