Featured Post

CHATURMASA DEEKSHA COMMENCES

The Chaturmasa Deeksha Sankalpam of Sri Sri Sri Pedda Jeeyangar Swamy of Tirumala commenced on Wednesday with kalasa sthapana and other Agam...

30.7.26

CHATURMASA DEEKSHA COMMENCES



The Chaturmasa Deeksha Sankalpam of Sri Sri Sri Pedda Jeeyangar Swamy of Tirumala commenced on Wednesday with kalasa sthapana and other Agama rites at the Sri Pedda Jeeyar Swami Mutt. 

The Jeeyangars proceeded in a procession, paid respects at Swami Pushkarini and Sri Varahaswamy Temple, and were welcomed at the Mahadwaram of Tirumala temple by TTD EO Sri Muddada Ravichandra.

After the Darshan and other traditional rituals, Sri Pedda Jeeyangar received the Melchat Vastram and Sri Chinna Jeeyangar the Noolchat Vastram.

TTD board members and temple officials were also present.

శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం chaturmasa deeksha




తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా ప్రారంభమైంది

శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త శ్రీ రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంది. ఆషా శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారని ప్రాశస్త్యం.  కావున నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

ముందుగా శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. త‌రువాత సేక‌రించిన పుట్ట మ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం ‌‌శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయ్యంగారి ఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ  స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారిని ర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.

శ్రీవారి ఆలయ మహ‌ద్వారం చెంత టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు.  

అనంతరం శ్రీపెద్దజీయర్‌ మఠంలో శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ చిన్నజీయర్‌స్వామి కలిసి ఈవో, బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామ కృష్ణ, నాసన్మానించారు.

POURNAMI GARUDA SEVA HELD




Pournami Garuda Seva was held at Tirumala in a grand manner on Wednesday evening.

Devotees occupied the Mada Street galleries to witness Sri Malayappa Swamy on Garuda Vahanam that was held between 7pm and 9pm braving drizzles.

HH Sri Pedda jiyar Swamy, HH Sri Chinna Jiyar Swamy of Tirumala,TTD Board members Smt Panabaka Lakshmi, Sri Bhanu Prakash Reddy, Tirumala temple DyEO Sri Lokanatham were present.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ garuda seva




తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై లయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

SCIENTISTS CALL FOR GREEN CHEMISTRY TO PROTECT THE ENVIRONMENT




A two-day National Conference on "Sustainable Chemical Synthesis for Environmental Protection (SCSREI)" commenced at S.V. Arts College (Autonomous), Tirupati, on Wednesday.

Inaugurating the conference, TTD Chief Public Relations Officer Dr. T. Ravi urged young scientists and researchers to focus on innovative green chemistry solutions for environmental protection and sustainable development.

The conference featured keynote lectures by eminent scientists from the University of Delhi, IIT Madras, IIT Tirupati, and IIT Kharagpur on eco-friendly drug development, green technologies, and emerging trends in chemical research. Research scholars from universities across the country presented their research papers.

హరిత రసాయన పరిశోధనలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం : ప్రముఖ శాస్త్రవేత్తల పిలుపు ENVIRONMENT




తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల (అటానమస్) రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "పర్యావరణ పరిరక్షణకు దోహదపడే స్థిరమైన రసాయన సమ్మేళనాల తయారీ (SCSREI)" అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ రసాయన శాస్త్ర సదస్సు బుధవారం కళాశాల సమావేశ మందిరంలో వైభవంగా ప్రారంభమైంది.

కళాశాల ప్రిన్సిపాల్ డా. వేణుగోపాల్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ సిపిఆర్వో డా. టి. రవి, ఎస్.పీ.డబ్ల్యూ. డిగ్రీ & పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. నారాయణమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిపిఆర్వో డా. టి.రవి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ నేటి ప్రపంచానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. హరిత రసాయన శాస్త్ర పరిశోధనలు ప్రకృతి వనరుల సంరక్షణతో పాటు కాలుష్య నియంత్రణకు సమర్థవంతమైన మార్గాలని తెలిపారు. విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే దిశగా మలచాల్సిన బాధ్యత యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులపై ఉందన్నారు. విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే దిశగా మలచాల్సిన బాధ్యత యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులపై ఉందన్నారు. పర్యావరణ హిత సాంకేతికతలను అభివృద్ధి చేస్తూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, సుస్థిరమైన ప్రపంచాన్ని అందించేందుకు విద్యార్థులు పరిశోధనా రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. విద్య, విజ్ఞానం, విలువలు సమన్వయంతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వివ‌రించారు.

పర్యావరణహిత ఔషధ తయారీపై కీలకోపన్యాసం

ఢిల్లీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డా. పన్నూరు వెంకటేశు "ఔషధ తయారీలో పర్యావరణహిత ద్రావకాల వినియోగం – ఔషధ సూత్రీకరణల్లో అయానిక్ ద్రవాలు, డీప్ యూటెక్టిక్ ద్రావకాల ప్రాధాన్యం" అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఔషధ తయారీలో పర్యావరణహిత ద్రావకాల వినియోగం వల్ల ఔషధాల ద్రావణీయత, స్థిరత్వం, జీవలభ్యత పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా విశేషంగా దోహదపడుతుందని ఆయన వివరించారు.

ఆధునిక పరిశోధనా ధోరణులపై నిపుణుల విశ్లేషణ

అనంతరం ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ డా. రమేష్ గురుదాస్, ఐఐటీ తిరుపతికి చెందిన కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డా. సునీల్ కుమార్, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన రసాయన శాస్త్ర ప్రొఫెసర్ డా. ఏ. రాజ్ కుమార్ ఉపన్యాసాలు అందించి రసాయన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలు, ఆధునిక పరిశోధనా దిశలు, పారిశ్రామిక అనువర్తనాలు, హరిత సాంకేతికతలపై సమగ్రంగా వివరించారు.

దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు చెందిన పరిశోధక విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను మౌఖికంగా సమర్పించి శాస్త్రీయ చర్చల్లో పాల్గొన్నారు.

రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. పి.వి. చలపతి కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ జాతీయ సదస్సులో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ANKURARPANAM PERFORMED FOR SRI PRASANNA VENKATESWARA SWAMY PUSHPA YAGAM


The Ankurarpanam ritual for the annual Pushpa yagam of Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta was performed as per Agama traditions on Wednesday evening. The Pushpayagam will be held on July 30.

Earlier in the day, Acharya Ritwik Varanam was conducted. In the evening, Medini Puja, Senadhipati Utsavam and Ankurarpanam were performed.

On Thursday, July 30, Snapana Tirumanjanam to the Utsava deities of Sri Prasanna Venkateswara Swamy along with Sridevi and Bhudevi will be held from 11 am to 12 noon. Pushpa yagam will be performed from 3 pm to 5.30 pm. Later, from 6.30 pm to 7.30 pm, the Lord and His Consorts will bless devotees in a Tiruchi procession through the four Mada Streets.

Temple AEO Devarajulu, Chief Priest Suryakumaracharyulu, Superintendent Srivani, Temple Inspector Venugopal and others participated in the rituals.