Featured Post

₹10 Lakhs Donation to TTD

A devotee from Hyderabad, Sri Bandi Satya Narayana, donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Saturday. The donor...

23.8.26

₹10 Lakhs Donation to TTD




A devotee from Hyderabad, Sri Bandi Satya Narayana, donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Saturday.


The donor handed over the donation cheque to TTD Chairman Sri B.R. Naidu.

శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ankurarpanam




శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

ASHTABANDHANA MAHASAMPROKSHANAM TO BEGIN AT DEVUNI KADAPA TEMPLE


The Ankurarpana for the Jeernoddharana Ashtabandhana Mahasamprokshanam at Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa, will be held on August 23 as per Agama traditions.

The rituals will continue from August 23 to 26, with the Mahasamprokshanam scheduled on August 26 from 9.45 am to 11.30 am.

Devotees will be allowed darshan of the Moolavarlu from the afternoon of August 26 after completion of the Mahasamprokshanam

ఆగ‌స్టు 23న దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ devuni kadapa


దేవుని క‌డ‌పలోని శ్రీ ల‌క్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణకు ఆగ‌స్టు 23 సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

ఆగ‌స్టు 23న సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు వాస్తుశాంతి, మృత్సంగ్రహణము, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఆగ‌స్టు 24న ఉదయం 8 గంటలకు మనోన్మాన ప్రమాణ శాంతి హోమము, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనము, శాత్తుమొర, సాయంత్రం 6.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆగ‌స్టు 25న ఉదయం 7.30 గంటలకు చతుస్థానార్చన, ఏకశీతి కలశ స్నపనము, మూర్తి హోమము, అష్టబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర కార్యక్రమాలు జరుగుతాయి.

ఆగ‌స్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమము, ప్రాయశ్చిత్త హోమము నిర్వహిస్తారు. ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

మహాసంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం 26వ తేదీ మధ్యాహ్నం నుండి స్వామి, అమ్మవార్ల మూలవర్ల  దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

ANKURARPANAM FOR PAVITHROTSAVAM HELD




The Ankurarpanam ritual in connection with the three-day annual Pavitrotsavams was observed in Tirumala on Saturday evening.

As a part of it, Sri Vishwaksena, the commander-in-chief of Sri Venkateswara Swamy, was taken to Vasanta Mandapam and the rituals of Mritsangrahanam for Ankurarpanam was performed.

The TTD Additional EO Sri Ch.Venkaiah Chowdhary, CV&SO Sri Murali Krishna, Temple Dy EO Sri Lokanatham And other officials, religious staff were present.

Meanwhile TTD has cancelled Sahasra Deepalankara Seva in connection with this fete.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన శ్రీ బండి సత్య నారాయణ అనే భక్తుడు శనివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


మేరకు దాత టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం pavitrotsavams







తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.

అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.