Featured Post

SRI MAHALAKSHMI DEEPA PUJA TO BE HELD GRANDLY IN PALAMANER ON AUGUST 14

TTD JEO Dr. A. Sharath directed officials to complete all arrangements for the Sri Mahalakshmi Deepa Puja, to be held at the SVCR Government...

13.8.26

SRI MAHALAKSHMI DEEPA PUJA TO BE HELD GRANDLY IN PALAMANER ON AUGUST 14



TTD JEO Dr. A. Sharath directed officials to complete all arrangements for the Sri Mahalakshmi Deepa Puja, to be held at the SVCR Government Junior College premises in Palamaneru on August 14 at 6 pm.

The JEO, along with local MLA and former Minister Sri N. Amarnath Reddy, inspected the arrangements on Wednesday and directed all departments to coordinate closely to ensure a smooth and comfortable experience for devotees.

Extensive facilities are being arranged for thousands of devotees, including spacious shelters, mats, Deepa Puja materials, Annaprasadam distribution centres, drinking water, LED screens and temporary toilets.

Divine ambience at the Deepa Puja venue

The TTD Electrical and Garden departments have been instructed to decorate the venue with illuminations and beautiful floral arrangements and create a serene and spiritually uplifting atmosphere for devotees.

Focus on spiritual experience

MLA and former Minister Sri N. Amarnath Reddy said the arrangements should promote devotion and spiritual awareness among devotees. He also stressed the need to provide all necessary facilities and maintain a peaceful and pleasant atmosphere at the venue.

Live telecast on SVBC

The Sri Venkateswara Bhakti Channel (SVBC) will telecast the Sri Mahalakshmi Deepa Puja live from 6 pm on August 14, the JEO said. He wished that devotees would witness the divine programme and receive the blessings of Sri Mahalakshmi Ammavaru.

HDPP Secretary Dr. Medasani Mohan, DEs Smt. Saraswathi and Sri Sarvesh, AE Sri Chandramouli, SVBC CPO and other officials participated in the inspection.

ఆగష్టు 14న పలమనేరులో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ deepa pooja





పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆగష్టు 14న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ఎన్. అమరనాథ్ రెడ్డితో కలిసి బుధవారం ఆయన దీప పూజ ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో సూచించారు. వేలాది మంది భక్తుల కోసం విశాలమైన షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, తాగునీటి సౌకర్యం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 

దివ్య కాంతులతో ముస్తాబవుతున్న దీప పూజ వేదిక

టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు దీప పూజ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, సుందర పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జేఈవో సూచించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా పూజా ప్రాంగణంలో పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా ఏర్పాట్లు : ఎమ్మెల్యే

శ్రీ మహాలక్ష్మీ దీప పూజలో పాల్గొనే భక్తుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన మరింతగా పెంపొందించేలా ఏర్పాట్లు ఉండాలని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ఎన్. అమరనాథ్ రెడ్డి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, పవిత్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచాలని ఆయన కోరారు.

ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం

శ్రీ మహాలక్ష్మీ దీప పూజ మహోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా ఆగష్టు 14న సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు. భక్తులు ఈ దివ్య దీప పూజను వీక్షించి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌డీపీపీ కార్యదర్శి డా. మేడసాని మోహన్, డీఈలు శ్రీమతి సరస్వతి, శ్రీ సర్వేశ్, ఏఈ శ్రీ చంద్రమౌళి, ఎస్వీబీసీ సీపీవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

SAHASRA KALASABHISHEKAM AND HANUMANTHA VAHANAM SEVA HELD GRANDLY AT SRI KODANDARAMA SWAMY TEMPLE




The Sahasra Kalasabhishekam and Hanumantha Vahanam Seva were performed with devotion and grandeur at Sri Kodandarama Swamy Temple in Tirupati on Wednesday on the occasion of Amavasya.

As per Vaikhanasa Agama traditions, Pournami, Amavasya, Shukla Ekadasi, Krishna Ekadasi, and the Shravanam and Punarvasu stars have special significance in Vaishnava temples. As part of the observance, Sahasra Kalasabhishekam was performed at 8.30 am. Householders (two persons) who participated in the seva by paying Rs.500 were presented with an uttariyam, blouse piece, laddu and vada prasadam.

Hanumantha Vahanam Seva Draws Devotees

The Hanumantha Vahanam Seva was held from 7 pm to 9 pm. Sri Kodandarama Swamy, adorned in rich ornaments, was taken in a grand procession on His favourite Hanumantha Vahanam through the four Mada streets, blessing the devotees.

The divine sight of Lord Kodandarama on the vahanam of Lord Hanuman, the ardent devotee of Lord Rama, delighted devotees. A large number of devotees gathered to witness the sacred procession.

Deputy EO Smt. B. Nagaratna, Superintendent Sri K. Srinivasulu Reddy, Temple Inspector Sri Suresh, temple priests, staff and a large number of devotees participated in the celebrations.





శ్రీ కోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ hanumath vahanam



తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవ ఆలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఇందులో భాగంగా అమావాస్యనాడు ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. రూ.500 చెల్లించి సేవలో పాల్గొన్న గృహస్తులకు (ఇద్దరికి) ఉత్తరీయం, రవికె, లడ్డూ, వడ ప్రసాదాలను అందజేశారు.

భక్తులను కనువిందు చేసిన హనుమంత వాహనసేవ

బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనసేవను వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీరాముని పరమభక్తుడైన ఆంజనేయస్వామి వాహనంపై శ్రీ కోదండరామస్వామివారి దివ్యదర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి మంగళకర దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SRIVARI SEVA “TRAIN THE TRAINER” SECOND PHASE TRAINING COMPLETED IN 43 DAYS




Following the call given by the Hon’ble Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu, to further strengthen Srivari Seva and provide quality services to the devotees, TTD’s Public Relations Department, with the cooperation of the Planning Department of the Government of Andhra Pradesh, successfully completed the second phase of the Srivari Seva “Train the Trainers” programme on Wednesday after 43 days of training in Tirumala.

The second phase of the programme commenced on July 01. A total of 1,888  Group Supervisors from Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka, Maharashtra and other Hindi-speaking states participated in the training. Including the first phase, nearly 3,000 Group Supervisors have so far received training.

 Aim to Enhance Quality of Seva

The main objective of this programme is to enhance the service skills, spirit of service, discipline, leadership qualities and communication skills of Srivari Seva volunteers.

The trained supervisors will provide pre-Tirumala training to Srivari Seva volunteers registered online in their respective mandals and districts before they arrive at Tirumala.

This initiative will help improve the quality of service, dedication and responsible conduct of volunteers and enable them to provide efficient, disciplined and devotional services to devotees visiting Tirumala.

Comprehensive Training

Faculty members from the TTD Veda Patashala, experts from various TTD departments and other resource persons provided training on the glory of Lord Sri Venkateswara, the significance of Tirumala, its Puranic importance, the significance of rituals and Kainkaryams, the areas of services by  Sevaks, CPR,  and various other subjects where sevaks could offer enhanced services to devotees.

Field-Level Training at Service Centres

As part of the training, the participants visited various plaves, including the Laddu Counters, Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex, Kalyanakatta, Vaikuntham Queue Complex and Reception areas to know the practical issues in Seva and how to better the service activities.

They were given exposure to the services being provided to devotees, the responsibilities of volunteers, challenges faced in real-time situations and effective ways of addressing such issues.

Special Features of the Training

Around 200 volunteers were trained in each batch. Every participant was provided with a training kit and a Group Supervisor Training Manual.

Spiritual publications brought out by the Hindu Dharma Prachara Parishad, including Govinda Namalu, Bhagavad Gita, Srinivasa Gatha, Vishnu Sahasranamam, Lakshmi Ashtottaram and Lalitha Sahasranamam, were also provided to the participants.

Retired Gazetted Officers as Principal Supervisors

From August 1 onwards, five retired Gazetted Officers have been deployed as Principal Supervisors to monitor the functioning of the Group Supervisors.

They will regularly monitor the services of the Group Supervisors and take necessary measures at the field level to ensure better services to devotees.

Some volunteers who were trained during the first phase were also involved in the second phase of the programme, enabling them to share their practical experiences with other participants.

Supervision by Master Trainers

The training programme was supervised by former Associate Professor of the National Cooperative Training Institute (NCCT) under the Ministry of Cooperation, Government of India, and noted HR Consultant Dr. S.L.N.T. Srinivas, TTD Chief Public Relations Officer Dr. T. Ravi, PRO (FAC)Ms. Neelima, and coordinators of the Srivari Seva department.

Senior Srivari Seva volunteer Sri Sarath from Tamil Nadu played a key role in designing the training programme for Tamil-speaking regions.

The first phase of the SriVlvari Seva “Train the Trainers” programme commenced in December 01 last year and concluded on February 07 in 2026. A total of around 1,011 Group Supervisors were trained in 10 batches.

The first seven batches consisted of volunteers from Andhra Pradesh and Telangana, while the final three batches included volunteers from Tamil Nadu, Karnataka and Hindi-speaking states.

Based on the experience gained during the first phase, a minimum educational qualification of graduation was prescribed for the second phase, and applications were accepted exclusively through the online mode.

With 1,888 Group Supervisors trained during the second phase, TTD now has a larger pool of trained Group Supervisors to the tune of almost 3000, capable of managing Srivari Seva more effectively at the field level.

During the training programme, TTD Executive Officer Sri Muddada Ravichandra, Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary, the Chief Priest of Srivari Temple,  Secretary from Ramakrishna Mutt-Tirupati, Sri Satha Sai Seva Samiti National Co-ordinator, heads of various TTD departments and other staff members provided training to the trainers on various aspects related to TTD.

శ్రీవారి సేవ "ట్రైన్ ది ట్రైనర్స్" రెండో విడత శిక్షణ 43 రోజుల్లో పూర్తి 10 బ్యాచ్‌లలో 1,888 మంది గ్రూప్ సూపర్‌వైజర్లకు శిక్షణ training




 శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక  విభాగం సహకారంతో  టీటీడీ  ప్రజా సంబంధాల శాఖ  43  రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ రెండో విడత శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది.

2026 జూలై 1వ తేదీన ప్రారంభమైన ఈ రెండో విడత శిక్షణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన 1888 మంది శ్రీవారి సేవ గ్రూప్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. మొద‌టి బ్యాచ్ తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 3000 వేల మంది గ్రూప్ సూపర్‌వైజర్లు శిక్షణ పొందారు.

సేవా నాణ్యత పెంపొందించడమే లక్ష్యం

శ్రీవారి సేవకుల్లో సేవా నైపుణ్యాలు, సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. శిక్షణ పొందిన ట్రైన‌ర్లు తమ తమ మండలాలు, జిల్లాల్లో ఆన్‌లైన్ ద్వారా శ్రీవారి సేవకు నమోదు చేసుకున్న సేవకులకు తిరుమలకు వచ్చే ముందే శిక్షణ అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

దీంతో సేవకుల్లో సేవా నాణ్యత, అంకితభావం, బాధ్యతాయుత ప్రవర్తన మరింత పెరిగి, తిరుమలకు విచ్చేసే భక్తులకు సమర్థవంతమైన, క్రమశిక్షణతో కూడిన, భక్తి భావపూర్వక సేవలు అందించేందుకు దోహదపడుతుంది. 

సమగ్ర శిక్షణ

 వేద పాఠశాల అధ్యాపకులు, టీటీడీలోని వివిధ విభాగాల నిపుణులు, ఉపన్యాసకులు శ్రీవారి వైభవం, తిరుమల మహత్యం, పురాణ ప్రాశస్త్యం, పూజలు, కైంకర్యాల విశిష్టత, శ్రీవారి సేవ ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

సేవా కేంద్రాల్లో క్షేత్రస్థాయి శిక్షణ

 శిక్షణలో భాగంగా లడ్డూ కౌంటర్లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రిసెప్షన్ తదితర సేవా కేంద్రాలను శిక్షణార్థులు సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సేవలు, సేవకుల బాధ్యతలు, వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యలు, వాటిని సమర్థవంతంగా పరిష్కరించే విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.

శిక్షణలో ప్రత్యేకతలు

ప్రతి బ్యాచ్‌లో సుమారు 200 మంది సేవకులకు శిక్షణ అందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ కిట్, గ్రూప్ సూపర్‌వైజర్ ట్రైనింగ్ మాన్యువల్ అందించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రచురించిన గోవింద నామాలు, భగవద్గీత, శ్రీనివాస గాథ, విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా అందించారు.

ప్రిన్సిపల్ సూపర్వైజర్లుగా విశ్రాంత గెజిటెడ్ ఆఫీసర్ల సేవలు

గ్రూప్ సూపర్వైజర్ల పని తీరును పర్యవేక్షించేందుకు ఆగస్టు 1వ తేది నుండి ఐదుగురు విశ్రాంత గెజిటెడ్ అధికారులను ప్రిన్సిపల్ సూపర్వైజర్లుగా నియమించడం జరిగింది. వీరు గ్రూప్ సూపర్వైజర్ల సేవలను అనునిత్యం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటారు.

మొదటి విడతలో శిక్షణ పొందిన కొంతమంది సేవకులకు రెండో విడతలో శిక్షణ ఇవ్వడంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా వారి అనుభవాలను ఇతర సేవకులతో పంచుకునే అవకాశం కల్పించారు.

మాస్టర్ ట్రైనర్ల పర్యవేక్షణ

భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌సీసీటీ మాజీ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ హెచ్‌ఆర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.టి. శ్రీనివాస్, టీటీడీ సీపీఆర్‌వో డాక్టర్ టి.రవి, పీఆర్వో కుమారి నీలిమ, శ్రీవారి సేవా విభాగం సమన్వయకర్తలతో కలిసి ఈ శిక్షణా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

తమిళనాడుకు చెందిన సీనియర్ సేవక్ శ్రీ శరత్ తమిళ భాషా ప్రాంతాల శిక్షణ కార్యక్రమ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

తొలి విడతలో 1011 మందికి శిక్షణ

శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ తొలి విడత శిక్షణ గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమై 2026 ఫిబ్రవరి 7న ముగిసింది. మొత్తం 10 బ్యాచ్‌లలో సుమారు 1011 మంది గ్రూప్ సూపర్‌వైజర్లు శిక్షణ పొందారు. తొలి ఏడు బ్యాచ్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సేవకులు, చివరి మూడు బ్యాచ్‌లలో తమిళనాడు, కర్ణాటకతో పాటు హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన సేవకులు పాల్గొన్నారు.

మొదటి విడతలో వచ్చిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని రెండో విడతలో కనీస విద్యార్హతగా డిగ్రీని నిర్దేశించడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. రెండో విడతలో 1,888 మంది గ్రూప్ సూపర్‌వైజర్లకు శిక్షణ అందించడంతో శ్రీవారి సేవను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు టీటీడీకి అందుబాటులోకి వచ్చారు.

ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ ర‌విచంద్ర‌, అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్.వెంక‌య్య చౌద‌రి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు,  రామకృష్ణ మఠం స్వామీజీ, సత్య సాయి  నేషనల్ కోఆర్డినేటర్ టీటీడీ లోని వివిధ విభాగాల అధిప‌తులు, ఇతర సిబ్బంది ట్రైన‌ర్ల‌కు టీటీడీకి సంబంధించిన పలు అంశాలపై శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింది.