Featured Post

Sri Soumyanatha Swamy Blesses Devoteeson Matsya Avataram

As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandalur, Lord Sri Soumyanatha Swamy, accompanied by Sridevi and Bhudev...

24.7.26

Sri Soumyanatha Swamy Blesses Devoteeson Matsya Avataram




As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandalur, Lord Sri Soumyanatha Swamy, accompanied by Sridevi and Bhudevi, gave darshan to devotees on Tiruchi in Matsya Avataram on the second day of the festivities on Thursday morning.

Depicting Lord Vishnu's first incarnation, Matsya Avataram, the procession passed through the village streets amid continuous chanting of "Govinda", traditional Chekka Bhajans, Kolatam, and auspicious musical performances, creating a deeply devotional atmosphere. Devotees offered Karpura Harati at various points and received the Lord's blessings.

Temple Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, priests, officials, and a large number of devotees participated in the Vahana Seva.

తిరుచ్చిపై మత్స్యావతారంలో భక్తులను మంత్రముగ్ధులను చేసిన శ్రీ సౌమ్యనాథస్వామి mastyavataram


 

నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ఉదయం తిరుచ్చిపై మత్స్యావతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు.

"విష్ణుమూర్తి ప్రథమావతారమైన మత్స్యావతార వైభవంలో" కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ ఆధ్యాత్మిక పరవశాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Ankurarpanam for Thallapaka Brahmotsavams on 24th July




The Ankurarpanam for the annual Brahmotsavams of Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy temples at Tallapaka, the birthplace of Saint Annamacharya, will be held on July 24. The Brahmotsavams will be celebrated from July 25 to August 2, followed by Pushpayagam on August 3.

The festivities include Dwajarohanam, daily Vahana Sevas, Garuda Seva, Rathotsavam, Kalyanotsavam, Parveta Utsavam, Chakrasnanam, Vasanthotsavam, and Dhwajavarohanam. Special Arjitha Kalyanotsavam will be held on July 30 in both temples.

Devotional discourses, Harikatha, and spiritual music programmes will also be organised daily by the TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project during the festival.

TTD to Conduct E-Auction of Used Empty Gunny Bags on 31st July




TTD will conduct an e-auction on July 31, 2026, for the sale of used empty gunny bags from Sri Venkateswara Swamy Temple, Tirumala, and other TTD-affiliated temples on a rate contract basis for the period April 1, 2026, to March 31, 2027.

Interested individuals and firms wishing to participate in the auction should register through the Konugolu Portal by paying an EMD of Rs.30,000 on or before the evening of July 30, 2026.

For detailed information, visit https://konugolu.ap.gov.in

For further enquiries, contact the TTD General Manager (Auctions) at 0877-2264429 or email gmauctionsttd@gmail.com.

TTD Reinstalls the Hanuman Idol as Per Agama Traditions Along 7th Mile Hanuman Idol Recovered within 14 Hours





In coordination with the TTD Vigilance Department and the District Police, the idol of Lord Hanuman that was stolen near the giant statue of Sri Prasanna Anjaneya Swamy Temple at the Seventh Mile on the First Ghat Road in Tirumala was recovered and reinstalled.


After the ceremonial Puja, TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary said that the Integrated Command and Control Centre (ICCC) played a key role in tracing the accused. Using the luggage/mobile deposit receipt, Facial Recognition System (FRS), and CCTV footage, officials identified the accused while he was leaving the after Darshan. The accused was arrested and the idol was recovered within 14 hours, he maintained.


To prevent such incidents in future, TTD will install protective grills around small temples and idols along the Ghat Road and strengthen surveillance with high-quality CCTV cameras.


He appealed to devotees to respect the sanctity of the idols along the Tirumala Ghat Roads and requested them to immediately report any suspicious activity to the TTD Toll-Free Helpline or Vigilance officials.


TTD has a state-of-the-art surveillance system capable of promptly detecting untoward incidents and identifying those responsible, he added.


TTD Board Member Smt. Panabaka Lakshmi, VGO Sri Surendra, and other officials participated in the reinstallation ceremony.

జూలై 31న టీటీడీ వాడిన ఖాళీ గోనె సంచుల ఈ–వేలం e-auction




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు "రేట్ కాంట్రాక్ట్" ప్రాతిపదికన విక్రయించేందుకు జూలై 31 -వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.

ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు జూలై 30వ తేదీ సాయంత్రం లోపు Konugolu పోర్టల్ ద్వారా రూ.30,000/- ఈఎండీ (EMD) చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను https://konugolu.ap.gov.in వెబ్‌సైట్‌ ను సందర్శించవచ్చు. అదనపు సమాచారం కోసం టీటీడీ జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబర్ లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ద్వారా సంప్రదించగలరు. 

14 గంటల్లో ఆంజనేయ స్వామి విగ్రహం స్వాధీనం శాస్త్రోక్తంగా పునః ప్రతిష్ఠించిన టీటీడీ anjaneya





తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటనలో టీటీడీ విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో వేగంగా చర్యలు చేపట్టి, 14 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో పాటు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.


టీటీడీ ఆగమ సంప్రదాయాల ప్రకారం పుణ్యహా వచనం, జల సంప్రోక్షణం తదితర శాస్త్రోక్త క్రతువులు నిర్వహించి, గురువారం ఉదయం 8.30 నుంచి 9.00 గంటల మధ్య అదే ప్రదేశంలో విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించినట్లు ఆయన వెల్లడించారు.


ఘటనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల నిఘా, విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తత, జిల్లా పోలీసులతో సమన్వయం కారణంగా అత్యంత తక్కువ సమయంలో నిందితుడిని గుర్తించి విగ్రహాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యమైందని అదనపు ఈవో పేర్కొన్నారు.


భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఘాట్ రోడ్డులోని చిన్న దేవాలయాలు, విగ్రహాలకు రక్షణగా గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మరింత నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


తిరుమల ఘాట్ రోడ్లలో దశాబ్దాలుగా భక్తులు ప్రతిష్ఠించిన అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయని, వాటి పవిత్రతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.


ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే భక్తులు టీటీడీ టోల్‌ఫ్రీ నంబర్ లేదా విజిలెన్స్ అధికారులకు తెలియజేయాలని కోరారు.


టీటీడీ వద్ద అత్యాధునిక నిఘా వ్యవస్థ అందుబాటులో ఉందని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా వాటిని వెంటనే గుర్తించి, బాధ్యులను గుర్తించే సమర్థమైన వ్యవస్థ పనిచేస్తోందని అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలియజేశారు.


పూజా కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.